బీసీసీఐ మెడికల్ టీమ్ సభ్యుడికి కరోనా పాజిటివ్..!

-

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికల్లో మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని ప్రాంఛైజీలు క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. అలాగే యూఏఈకి వెళ్లిన వారిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని 13 మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా.. బీసీసీఐ వైద్య బృందంలోని ఒక సభ్యుడు కరోనా బారిన పడ్డారు. అతనికి కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. అందరి ఆరోగ్యాన్ని చూసే మెడికల్ ఆఫీసరే కరోనా బారిన పడటం కలవరపాటుకు గురి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news