జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో సంచలన విషయాలు.. కార్లలో కండోమ్ ప్యాకెట్లు గుర్తించిన పోలీసులు

-

జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు.. వారిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఘటన జరిగిన తీరును పోలీసులు తెలుసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దిన్ ను ఈ నెల 10 నుంచి జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

విచారణలో సాదుద్దిన్ చెప్పిన వివరాల ఆధారంగా మైనర్లను కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిలో భాగంగానే.. నిందితులు వాడిన ఇన్నోవా, బెంజ్ కార్లలో పోలీసులు తనిఖీలు చేశారు. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు కార్లలో పోలీసులు కాండొమ్ ప్యాకెట్లు గుర్తించారు. వారు బాలికను రేప్ చేయాలనే ఉద్దేశంతోనే పబ్ కు వచ్చారని తేల్చారు. కాండొమ్ ప్యాకెట్లు తెచ్చుకున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news