చనిపోతానంటూ వీడియో పోస్ట్ చేసిన సీరియల్ నటి మేఘనా..!

-

మేఘనా లోకేష్.. తెలుగు సీరియల్స్ చూసేవారికి ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం “కళ్యాణం కమనీయం” సీరియల్ చేస్తున్న ఈమె అంతకుముందు కూడా పలు సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఇంట్లోనూ ఒక మనిషిలా కలిసిపోయింది మేఘన . అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఒక వీడియో పోస్ట్ చేసి నెటిజనులకు కలవరం సృష్టిస్తోంది. ఈమె ఫ్రెండ్స్ అయితే తెగ కంగారు పడిపోతున్నారు. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బుల్లితెర నటీనటులంటే ఒకప్పుడు సీరియల్స్, షోలలో మాత్రమే కనిపించేవారు. కానీ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తూ మిలియన్ల కొద్ది వ్యూస్ కూడా సంపాదిస్తున్నారు. అయితే రోజు కంటెంట్ దొరకడం అంటే ఎవరికైనా చాలా కష్టం అనిపిస్తుంది . అందులో భాగంగానే కొన్నిసార్లు థంబ్ నెయిల్స్ తో షాక్ ఇచ్చేలా.. కొన్ని వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. సరిగా ఇలాంటిదే మేఘనా కూడా చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే కొందరు ఈమె చేసిన పనికి ట్రోల్ చేస్తుండగా .. మరి కొంతమంది నవ్వుకుంటున్నారు.

తాజాగా ఒక రోజు ఖాళీగా ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చింది.. సమయంలో భర్త కూడా ఆఫీస్ కి వెళ్లిపోవడంతో ఫ్రెండ్స్ కి ఫ్రాంక్ కాల్ చేద్దామని ఫిక్స్ అయింది మేఘన. అందులో భాగంగానే కో యాక్టర్స్ కొందరికి ఫోన్ చేయగా.. ఇందులో కొంతమంది కాల్ బిజీ రాగా. మరికొందరికి కనెక్ట్ కాలేదు. ఫైనల్లీ మేఘన ఫ్రెండ్ యాక్టర్ స్వర్ణ రిటర్న్ కాల్ చేశారు. మేఘన..” ఇంట్లో ఎవరూ లేరు నీరసంగా అనిపిస్తుంది ..చచ్చిపోతానేమో” అని అయోమయంగా మాట్లాడింది.దీంతో అవతలి వైపు ఉన్న స్వర్ణ తెగ కంగారు పడిపోయింది . ఇప్పుడే వచ్చేస్తే కాల్ కట్ చేయొద్దని భయపడిపోయింది. చివర్లో ఇది ఫ్రాంక్ అని మేఘన చెప్పడంతో ఆమె రిలాక్స్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news