ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడ మల్లన్న.ఇదీ KCR తీరు – షర్మిల

-

ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడ మల్లన్న.ఇదీ KCR తీరని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేండ్లుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని… నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తోంది. ఉద్యోగాల కోసం నాడు ఉద్యమంలో మరణిస్తే.. నేడు కూడా ఉద్యోగాల కోసం చనిపోతున్నారని ఆగ్రహించారు.

దీనికి కారణం ముమ్మాటికీ కేసీఆరే.డిగ్రీలు, పీజీలు చేసిన బిడ్డలు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్​కు చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. కండ్ల ముందే రెండు లక్షల ఖాళీలు ఉన్నా భర్తీ చేయడం లేదు. దొంగ లెక్కలతో అరకొర నోటిఫికేషన్లు వేస్తూ.. నిరుద్యోగుల్ని ఆగం జేస్తుండని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. KCRకు ఉప ఎన్నికలు వస్తేనే నోటిఫికేషన్లు గుర్తుకొస్తయ్. త్వరలో 50వేల ఉద్యోగాలంటూ అన్ని ఉప ఎన్నికల్లో చెప్పాడు. మునుగోడులోనూ ఇదే వాడుకుంటాడు. నోటిఫికేషన్లు మాత్రం వేయడు. ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడ మల్లన్న.ఇదీ KCR తీరు అని చురకలు అంటించారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news