కేరళ సీఎంతో కేసీఆర్‌ భేటీ..రాక్షస పాలన అంటూ షర్మిల సెటైర్లు

-

నిన్న కేరళ సీఎం పినరయి విజయన్‌, సీపీఎం నేతలతో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా థర్డ్‌ ఫ్రంట్‌ పై చర్చ జరిగింది. అయితే.. ఈ సమావేశం పై వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీని ఏలడానికి మీటింగ్లు పెట్టుకోవడానికి సమయం ఉంటుంది కానీ రాష్ట్రంలో రైతు చావులను పట్టించుకోవడానికి సమయం లేదు దొర గారికి అంటూ కేసీఆర్‌ పై ఫైర్‌ అయ్యారు.

ఇంట గెలువనోడు రచ్చ గెలుస్తాడా? మీరు ఇక్కడి రైతులనే ఆదుకోనప్పుడు, రైతుల పాలిట రాక్షస పాలన చేస్తున్న ఈ రైతు ద్రోహి ప్రభుత్వానికి దేశం పట్టం కడుతుందా ? అని ఆగ్రహించారు. రైతుబంధు ఇచ్చి రైతులకు ఉపాధి చూపుతున్నాం అన్న దొరగారి గప్పాలు నిజమైతే మొన్న ఇద్దరు, నిన్న నలుగురు, ఇవాళ ఒక్కరు… పెట్టిన పెట్టుబడి రాక, అప్పుల బాధతో పంట నష్టపోయి ఆత్మహత్యలు ఎందుకు చేసుకొంటారు ? అని నిలదీశారు. రైతు ఆత్మహత్యలను ఆపడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దని కేసీఆర్‌ కు చురకలు అంటించారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news