కరెంట్ బిల్లులు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి – కేసీఆర్ పై షర్మిల ఫైర్

-

తెలంగాణలో కరెంట్‌ ఛార్జీల పెంపుపై వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెంట్ బిల్లులు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి.పేదోడి ఇంట్లో బల్బ్ వెలగాలంటే జేబుకు చిల్లు పడాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్‌ షర్మిల. మొన్నటి వరకు 80 యూనిట్ల లోపు వాడుకొంటే రూ.188 వచ్చిన బిల్లు
ఇప్పుడు రూ.307కు చేరిందని మండిపడ్డారు.

sharmila

ఇక పెరిగిన చార్జీలన్నీ 50,100,200 యూనిట్ల లోపు వాడుకొనే పేద, మధ్య తరగతి వాళ్లకే భారమని వెల్లడించారు. YSR గారు CM గా ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా బస్ చార్జీలు కానీ కరెంట్ చార్జీలు కానీ ఇంటి పన్ను కానీ ఒక్క పైసా పెంచలేదని గుర్తు చేశారు వైఎస్‌ షర్మిల.

సీఎం కేసీఆర్ గారు మాత్రం పన్నులు పెంచడమే పనిగా పెట్టుకొని పేదోని నడ్డి విరుస్తున్నాడని నిప్పులు చెరిగారు. పన్నులు, చార్జీలు తోచినంత పెంచి జనాల ముక్కు పిండి బిల్లులు వసూల్ చేస్తున్నాడని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు వైఎస్‌ షర్మిల. ప్రజల రక్తం తాగుతున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news