బీజేపీపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు… యూపీలో అఖిలేష్, పంజాబ్ లో ఆప్ అంటూ…

-

టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని జోస్యం చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ దెబ్బకు సమాజ్ వాదీ పార్టీ చేతుల్లో బీజేపీ ఓడిపోతుందని అన్నారు. పంజాబ్ లో ఆప్ చేతిలో ఓటమి తప్పదని అన్నారు. ఇటీవల జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆప్ చేతిలో బీజేపీ ఓటమి పాలైన విషయాన్ని కడియం శ్రీహరి గుర్తు చేశారు. యూపీ ఎన్నికల్లో ప్రధాని మోదీ, అమిత్ షా కాళ్లు విరగడం ఖాయమని విమర్శించారు. ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ ప్యాకేజీలు ప్రకటించిడం బీజేపీకి అలవాటైందని అన్నారు.

ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవుతూ వస్తుందన్నారు. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైందని ఆయన విమర్శించారు. కర్ణాటక, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అధికారిన్ని అడ్డుపెట్టుకుని అధికారం సాధించారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఎక్కడ యాంటీ బీజేపీ కూటమి ఏర్పాటు చేస్తారనే భయం బీజేపీకి పట్టుకుందని అయన ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా యాంటీ బీజేపీ పార్టీలన్నీ ఏకమవుతాయని ఆయన జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news