సిమ్‌కార్డు తీసుకునేవారికి షాక్..ఇకపై కొత్త నిబంధనలు

-

మొబైల్ వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక నుంచి కొత్త సీమ్‌ కొనుగోలు వారి కోసం కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం కొంత మందికి మొబైల్ కనెక్షన్ పొందడం సులభం అయితే మరికొంత మందికి చాలా కష్టం కానుంది. కొత్త నిబంధన ప్రకారం…. కొత్త మొబైల్ కనెక్షన్ కోసం స్టోర్ లకు వెళ్లాల్సిన పనిలేదు.

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే… సిమ్ కార్డు డైరెక్ట్ గా ఇంటికి చేరుతుంది. ఇప్పుడు టెలికం కంపెనీలు 18 సంవత్సరాలు వినియోగదారులకు కొత్త సిమ్ ను అమ్మడం ఇక వీలు ఉండదు. 18 ఏళ్లు పైబడిన కస్టమర్లకు మాత్రమే… ఆధార్ ప్రూఫ్ తో అమ్ముతారు. ఈ మేరకు టెలికాం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పుడు కంపెనీ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులకు సిమ్ కార్డులు విక్రయించబోవన్నమాట. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఆ స్టోరీ యాజమానిని దోషిగా టెలికామ్ కంపెనీ పరిగణిస్తుంది. అలాగే ప్రీ పెయిడ్‌ ను… పోస్ట్‌ పెయిడ్ గా మార్చుకోవడానికి కొత్త వన్ టైం పాస్ వర్డ్ ఆధారిత ప్రక్రియ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news