లతా మంగేష్కర్ ఆరోగ్యంలో స్వల్ప మెరుగుదల… ఇంకా ఐసీయూలోనే చికిత్స

-

కోవిడ్ బారిన పడి పలువురు ప్రముఖులు చికిత్స తీసుకుంటున్నారు. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు వరసగా కరోనా సోకడం అందరిని కలవరపరుస్తోంది. ఇటీవల గానకోకిల, భారతరత్న లతామంగేష్కర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తాజాగా లతా మంగేష్కర్ ఆరోగ్యంలో స్వల్ప మెరుగుదల ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా ఇప్పటికీ లతా మంగేష్కర్ ను ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

థర్డ్ వేవ్ ప్రారంభం అయిన తర్వాత చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, క్రీడాకారులు కరోనా బారిన పడటం వారి అభిమానులకు, అనుచరులకు ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య కూడా ఇటీవల పెరిగింది. అయితే మరణాలు ఎక్కువ లేకపోవడం చాలా ఉపశమనం కలిగించే విషయం. అయినప్పటికీ కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేయడానికి అన్ని రాష్ట్రాలు ఆంక్షలను పెడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో రోజుకు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news