నా బ్యాంకు లాకర్‌లో ఏం దొరకలేదు: సిసోడియా

-

లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్‌ను సీబీఐ అధికారులు ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ‘సీబీఐ దాడుల సమయంలో నా నివాసంలో ఏమి దొరకలేదు. ఈ రోజు నా బ్యాంకు లాకర్‌ను చెక్ చేశారు. బ్యాంకు లాకర్‌లోనూ ఏం దొరకలేదు. నాకు క్లీన్ చిట్ లభించినందుకు సంతోషంగా ఉంది.’ అని పేర్కొన్నారు.

మనీష్ సిసోడియా
మనీష్ సిసోడియా

ఈ రోజు ఉదయం గాజీయాబాద్‌లోని బ్యాంకులో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో సిసోడియాతోపాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేయిస్తున్న విచారణలో తనకు క్లీన్‌చిట్ లభించిందని సిసోడియా పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందనే ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇప్పటికే సిసోడియా ఇంట్లో సోదాలు నిర్వహించగా.. తాజాగా బ్యాంకు లాకర్‌ను చెక్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news