కుక్కని బతికించా.. చెల్లిని బతికించలేనా ?

-

మదనపల్లి జంట హత్యలకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ హత్యకు కారణం తల్లి పద్మజ అని అందరూ భావించారు..ఆమెకి డెల్యూషన్స్ అనే మానసిక వ్యాధి ఉండడంతో ఆమె వల్లే మిగతా కుటుంబానికి కూడా అది సోకిందని వైద్యులు గుర్తించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ఘటన మొత్తానికి పెద్దమ్మాయి అలేఖ్య కారణమని తెలుస్తోంది.

 

2 వారాల క్రితం పెంపుడు కుక్కతో చిన్నమ్మాయి దివ్య బయటకు వెళ్లిందని, ఆ సమయంలో బయట ఏదో ముగ్గు తొక్కానని దివ్య అనుమానపడినట్లు సమాచారం. ఆ మరుసటి రోజు నుంచి దివ్య అనారోగ్యం పాలైంది అని, అప్పటి నుంచి ఆమె చనిపోతానని భయంలోనే ఉండి పోయిందని తెలుస్తోంది. అయితే నువ్వు చనిపోవాలని పెద్దమ్మాయి అలేఖ్య పదేపదే చెబుతూ ఉండేదని గుర్తించారు. ఎందుకైనా మంచిది ఈ నెల 23న భూతవైద్యుడు తల్లిదండ్రులు తాయత్తులు కట్టించారు.

24న ఏడుస్తూ మేడ పైకి వెళ్లిన దివ్యను దెయ్యం భయంతో వేపాకులతో తల్లిదండ్రులు కొట్టారు. అదే రోజు రాత్రి ఆమెను డంబెల్స్ తో తలపై కొట్టి ముగ్గురు కలిసి హత్య చేశారు. అనంతరం పూజ గదిలోకి వెళ్ళిన అలేఖ్య సగం గుండు కొట్టుకుని నోటిలో రాగి చెంబు పట్టుకుని తనను కూడా కొట్టి చంపాలని తల్లిదండ్రులను కోరింది. కుక్క చనిపోతే బతికించా, చెల్లెలు చనిపోతే బతికించుకోలేనా అని తల్లిదండ్రులను నమ్మించి ఆమె తనను తానే చంపుకుందని గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news