తెలంగాణలో టీడీపీ నేత దారుణ హత్య

-

తెలంగాణకు చెందిన టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. జనగామ జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ పులి స్వామిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఉదయం వాకింగ్ కు వెళ్ళి వస్తుండగా పులి స్వామి కోసం మాటు వేసిన ఇద్దరు వ్యక్తులు స్వామిని దారుణంగా నరికి చంపారు. అనంతరం వారు వచ్చిన బైక్ మీద వెళ్లేందుకు ప్రయత్నించారు, అయితే బైక్ స్టార్ట్ కాకపోవడంతో బైక్ అక్కడే వదిలేసి ఆ ఇద్దరు పలాయనం చిత్తగించారు.

అయితే ఈ హత్యకు భూవివాదాలు కారణం అయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. పులి స్వామి 2005 నుంచి టిడిపి తరఫున మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికై అనంతరం ఫ్లోర్ లీడర్ గా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో సైతం టీడీపీ నుంచి ఆయన కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడి పోయారు. అయినా సరే ఆయన టిడిపిలోనే కొనసాగుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news