జిన్నా సెంటర్ పై జెండా ఎగురవేస్తాం.. దమ్ముంటే ఆపుకోండి : సోము వీర్రాజు

-

గుంటూరు జిన్నా టవర్ సెంటర్ లో జాతీయ జెండాను ఎగురవేసి ఎందుకు ప్రయత్నించిన విహెచ్ పి సభ్యులను అరెస్టు చేయడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశ్మీర్లో తీవ్రవాదులను ఎదుర్కొని లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఎగురవేసిన ఘనత బిజెపి సొంతమనే విషయాన్ని సీఎం జగన్ గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.

త్వరలోనే జిన్నా సెంటర్ లో జాతీయ జెండాను ఎగుర వేస్తామని… దమ్ముంటే ఆపుకోండి అంటూ ప్రభుత్వానికి అలాగే పోలీసులకు సవాల్ విసిరారు సోము వీర్రాజు. కొత్త జిల్లా లు పరిపాలనా సౌలభ్యమని.. 2014లోనే బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరచామని చెప్పారు సోము వీర్రాజు.

బీజేపీ ప్రణాళికను నేటి ప్రభుత్వం అమలుపరుస్తోందని.. దీనిని బట్టి పరిపాలన పట్ల బీజేపీకి ఉన్న దూరదృష్టిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రెండు సంవత్సరాల క్రితమే మొత్తం 26 మంది జిల్లా అధ్యక్షులను పెట్టి, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసిందని.. స్థానికంగా నివశిస్తున్న ప్రజల అభిప్రాయాలను తీసుకుని ఆయా జిల్లాలకు పేర్లు పెట్టాలని వెల్లడించారు సోము వీర్రాజు.

Read more RELATED
Recommended to you

Latest news