ఏపీలో అడుగు పెట్టే అర్హతే కేసీఆర్‌ కు లేదు – సోము వీర్రాజు

-

ఏపీలో అడుగు పెట్టే అర్హతే కేసీఆర్‌ కు లేదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ప్రకటించిన అనంతరం.. ప్రతిపక్షాలు అలాగే ఏపీలోని పార్టీలు కూడా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బి.ఆర్.ఎస్ ఏర్పాటుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. జాతీయ పార్టీ పెట్టె హక్కు కేసీఆర్ కు లేదని విమర్శించారు. ఎన్నికల తర్వాత బిఆర్ఎస్, విఆర్ఎస్ తీసుకోవాల్సిందేనంటూ సెటైర్లు పేల్చారు.

తెలంగాణలో టిఆర్ఎస్ ఓటమి ఖాయమని సోము వీర్రాజు జోస్యం చెప్పారు. కెసిఆర్ కూతురు ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇరుక్కుందన్నారు. ఆంధ్ర ప్రజలు ద్రోహులు, సన్యాసులు అని నోటికి వచ్చినట్లు బూతులు తిట్టిన కేసీఆర్ కు ఏపీకి వచ్చే అర్హత లేదని విమర్శించారు. జాతీయస్థాయిలో కొత్త పార్టీ పెట్టే హక్కు కేసీఆర్ కు అసలు లేదని వ్యాఖ్యానించారు. RSS చీఫ్ మోహన్ భగవత్ పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం సరికాదని సోము వీర్రాజు సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news