కేసీఆర్ కి ప్రధాని మోదీని విమర్శించే అర్హత లేదు… కేసీఆర్ వ్యాఖ్యలపై సోమువీర్రాజు ఫైర్

-

ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు, విమర్శలపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ నేతలే కేసీఆర్ పై విమర్శలు చేయగా.. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షడు సోము వీర్రాజు కేసీఆర్ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీపై విమర్శలు చేసే అర్హత కేసీఆర్ కు లేదని..సోము వీర్రాజు అన్నారు. ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయని.. దేశాభివ్రుద్ధిని చూసి కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని మారుస్తా అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చుకోలేక.. ఆస్తులు అమ్మేస్తున్న కేసీఆరా..  మోదీని తరిమేస్తారా.. అంటూ . ఆగ్రహం వ్యక్తం చేశారు.కుటుంబ పార్టీ మోదీని తరిమేస్తుందా.. అంటూ విమర్శించారు. సోనియాకు సాష్టాంగ నమస్కారం చేసిన కేసీఆర్.. ఆ విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలను బ్లాక్ మెయిల్ చేసే కేసీఆర్… ప్రధాని గురించి మాట్లాడుతారా.. అంటూ సోము వీర్రాజు ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news