సీఎం జగన్ కి సోము వీర్రాజు బహిరంగ లేఖ

-

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. పోలీస్ రిక్రూట్మెెంటులో అభ్యర్థుల వయో పరిమితికి మూడేళ్ల సడలింపు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు సోము వీర్రాజు.

“దాదాపు నాలుగేళ్ల తర్వాత మన రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 6,511 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇది నిరుద్యోగులకు ఊరటనిచ్చే అంశమే. కానీ నాలుగేళ్లుగా ఏటా ఖాళీలను భర్తీ చేయనందువల్ల అప్పటి నుంచీ ఈ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న వేల మంది నిరుద్యోగులకు ఇపుడు వయోపరిమితి మీరి పోయింది. అసలే కరోనా కారణంగా ఆదాయాలు క్షీణించి, ఉపాధి కరవై అనేక ఇబ్బందుల్లో ఉన్నారు.

ఇబ్బందుల్లో ఉన్న నిరుద్యోగులకు ఊరటనిచ్చేలా వయో పరిమితిలో సడలింపు ఇవ్వాలి. మూడేళ్ల పాటు వయో పరిమితి సడలింపు ఇస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వ సాయుధ పోలీసు దళాల్లో నియామకాలకు వయోపరిమితి రాయితీ ఇచ్చారు. పొరుగునున్న తెలంగాణలోనూ పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంచారు. ఏపీలో కూడా అధికారులతో చర్చించి.. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషనుకు సవరణగా వయో పరిమితి మూడేళ్లు పెంచుతూ నోటిఫికేషన్ ఇవ్వాలి” అని లేఖలో పేర్కొన్నారు సోము వీర్రాజు.

Read more RELATED
Recommended to you

Latest news