ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

-

కరోనా బారిన పడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఐసోలేషన్ లో ఉండగా.. నేడు ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరారు. జూన్ 2న సోనియాకు కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. దీంతో ఆమె నేడు ఆసుపత్రిలో చేరారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యులు ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నందున ఆమె ఆసుపత్రిలోనే ఉంటారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వెల్లడించారు.

సోనియా ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ సందేశాలు పంపిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఆమె ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈడి తొలుత ఇచ్చిన సమన్ల మేరకు సోనియా హాజరు కావల్సి ఉండగా.. కరోనా కారణంతో మూడు వారాల గడువు కావాలని ఈడిని కోరారు కాంగ్రెస్ అధినేత్రి. కాగా ఇదే కేసులో సమన్లు అందుకున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం ఈడీ విచారణకు హాజరు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news