ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ

-

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగారం ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం సోనియా గాంధీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సర్ గంగారం ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బుల్లెట్ ప్రకారం.. సోనియా గాంధీ చెస్ట్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరూప్ బసు పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. తీవ్ర జ్వరం రావడంతో మార్చి రెండవ తేదీన ఆసుపత్రిలో చేరికయ్యారు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ పలు పరీక్షలు చేయించుకుంటున్నారు సోనియాగాంధీ. ఇక రాహుల్ గాంధీ ప్రస్తుతం లండన్ పర్యటనలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news