హైదరాబాద్ కు కొత్త టెన్షన్.. బయటపడ్డ ఉగ్రవాదుల కదలికలు…

-

హైదరాబాద్ లో మరోసారి ఉగ్రవాదుల కదలికలు బయటపడ్డాయి. ఈ నెల 17న బీహార్ లోని దర్భంగా రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న పేలుడు మూలాలు హైదరాబాద్ లో బయటపడ్డాయి. ఈ నెల 16న దర్భంగా రైల్వే స్టేషన్ కు సికింద్రాబాద్ నుంచి పార్సెల్ వెళ్లినట్లు గుర్తించారు బీహార్ రైల్వే పోలీస్ & ఏ టి ఎస్ బృందం. బీహార్ దర్భన్ లో రైలు నుంచి ఓ వస్త్రాల పార్సిల్ దిగుతుండగా ఈ నెల 17న పేలుడు జరుగగా..అనంతరం రంగంలోకి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దిగింది. పార్సిల్ చేసింది హైదరాబాద్ ఆసిఫ్ నగర్ కు చెందిన ఇమ్రాన్ & నాసిర్ గా గుర్తించారు అధికారులు.

పేలుళ్లకు కారణమైన వస్త్రాల పార్సెల్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వచ్చినట్లు సీసీ కెమెరా గుర్తించింది ఏటిఎస్ బృందం. సికింద్రాబాద్ కు కారులో పార్సెల్ చేసింది ఆసిఫ్ నగర్ కు చెందిన ఇమ్రాన్ & నాజిర్ గా గుర్తించింది యాంటీ టెర్రరిజం స్క్వాడ్ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్. దీంతో ఇమ్రాన్ & నజీర్ లను అదుపులోకి తీసుకొని బీహార్ వెళ్లింది ఏటిఎస్ టీమ్. వీరిద్దరినీ విచారణ నిమిత్తం బీహార్ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులకు అప్పగించింది ఏటిఎస్ బృందం.

Read more RELATED
Recommended to you

Latest news