తిరుపతిలో మార్చి 4న 29వ సదరన్ జోనల్‌ కౌన్సిల్.. ఆరు రాష్ట్రాల సీఎంల హాజరు !

-

తిరుపతిలో మార్చి 4న 29వ సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగనుంది. ఈ సమావేశం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్, కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరుగనుంది, ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరిల నుంచి సీఎంలు హాజరుకానున్నారు. అలానే అండమాన్‌ నికోబార్, లక్షద్వీప్‌ల నుంచి ప్రత్యేక ఆహ్వానితులు హాజరు కానున్నారు. ఈ కౌన్సిల్ సమావేశంలో 26 అంశాలపై చర్చ జరుగనున్నట్టు చెబుతున్నారు.

ఈ నేపధ్యంలో ఈరోజు క్యాంప్ కార్యాలయంలో సీఎం  వైయస్ జగన్ నేతృత్వంలో జరిగిన సన్నాహక సమావేశం జరిగింది. ఈ ఎజెండా అంశాలపై వివరాలను అధికారులు  సీఎంకు వివరించారు. అనంతరం ఇటీవల కేంద్ర వ్యవసాయశాఖ ప్రకటించిన పీఎం – కిసాన్‌ సమ్మాన్‌ అవార్డును అందుకున్న అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు  క్యాంప్‌ కార్యాలయంలో సీఎం  వైయస్‌.జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపధ్యంలో కలెక్టర్‌ గంధం చంద్రుడిని ముఖ్యమంత్రి జగన్ అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news