శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

-

శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. భక్తులకు అనుగుణంగా సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో  ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు తెలిపింది.  17, 24, 31వ తేదీల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఈ ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు వెల్లడించింది.  19, 26వ  తేదీల్లో తిరుపతి – సికింద్రాబాద్‌ మధ్య నడవనున్నాయి.

అలాగే సికింద్రాబాద్-దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ – దానాపూర్ మధ్య మార్చి 19, 26వ తేదీల్లో నడపనుంది. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్‌లో ప్రారంభమై.. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు దానాపూర్‌కు చేరుకుంటుంది. దానాపూర్ – సికింద్రాబాద్ రైళ్లు 16, 23 తేల్లో నడువనున్నాయి. దానాపూర్‌లో సాయంత్రం 8.50 గంటలకు దానాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.40 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకోనుంది.

రైళ్లు కాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్‌నగర్‌తో పాటు పలు రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. సెకండ్ క్లాస్ కోచ్‌లతో పాటు స్లీపర్, ఏసీ కోచ్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news