టీమిండియా కొత్త జెర్సీ ఇదే..ఫోటోలు ఇదిగో

-

టీమిండియా కొత్త జెర్సీ తళుక్కుమంది. ప్రపంచ కప్ కోసం రూపొందించిన కొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్లు మెరిసిపోతున్నారు. ఈ కిట్ ను బిసిసిఐ విడుదల చేయగా, జెర్సీని చూసిన భారత అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ జెర్సీ వేసుకున్న రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, హర్మన్ ప్రీత్ కౌర్, రేణుక సింగ్, షఫాలి వర్మ, సూర్య కుమార్ యాదవ్ లతో కూడిన పోస్టర్ ను తన ట్విట్టర్ ఖాతాలో బిసిసిఐ పోస్ట్ చేసింది.

ఈ జెర్సీని చూసిన భారత అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ జెర్సీని నైకీ కాకుండా MPL డిజైన్ చేసింది. నైకీతో కాంట్రాక్టు ముగియడంతో ప్రస్తుతం MPL టీమిండియా కిట్ స్పాన్సర్ గా ఉంది.

జెర్సీ విషయానికి వస్తే ఇందులో రెండు కలర్స్ ను వాడారు. షోల్డర్స్ దగ్గర ముదురు నీలం కలర్ ను, మిగతా భాగంలో లైట్ బ్లూ ను వాడారు. మధ్యలో కొన్ని గీతలు కూడా ఉన్నాయి. ఈ జెర్సీ 2007 టి20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు కిట్ కు దగ్గరగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news