హార్దిక్ పాండ్యా పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం

-

మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో గత రాత్రి సౌతాంప్టన్ లో జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా అర్థ సెంచరీ తో పాటు, రోహిత్ శర్మ, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్ రాణించడంతో భారత్ 8 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బౌలింగులో 148 పరుగులకే ప్రత్యర్థిని కట్టడి చేశారు. అయితే ఈ మ్యాచ్ మొత్తాన్ని హార్దిక్ పాండ్యా డామినేట్ చేశాడు.

అతని బ్యాటింగ్, బౌలింగ్ హైలెట్ గా నిలిచాయి. 33 బంతుల్లో 6 ఫోర్లు ఒక సిక్సర్తో 51 పరుగులు సాధించాడు. అంతేకాదు బౌలింగ్ లోనూ 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు నేల కూల్చాడు. దీంతో హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ ప్రదర్శనపై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో మాట్లాడాడు రోహిత్ శర్మ. హార్దిక్ పాండ్యా మున్ముందు మరిన్ని అద్భుతాలు సాధిస్తాడు అని చెప్పాడు.

ఐపీఎల్ 2022 సీజన్ నుంచి ఇప్పటివరకు పాండ్యా తనను తాను మలుచుకున్న తీరు ఓ అద్భుతం అని వ్యాఖ్యానించాడు. అతని బౌలింగ్ తనను ఇంప్రెస్ చేసిందని పేర్కొన్నాడు. బౌలింగులో మరింత గొప్పగా రాణించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. హార్దిక్ పాండ్యా బంతులను సందించడంలో వైవిధ్యాన్ని చూపాడని కొనియాడాడు.

Read more RELATED
Recommended to you

Latest news