ఐపీఎల్ 2023: సమరంలో నిలిచేది ఎవరు… లక్నో VS ముంబై

-

ఐపీఎల్ లో భాగంగా ఈ రోజు ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ లు హోరా హోరీ పోరులో తలపడనున్నాయి. లీగ్ స్టేజ్ లో అద్భుతంగా ఆడి నాక్ అవుట్ స్టేజ్ కు ఇరు జట్లు అర్హత సాధించాయి., ముఖ్యంగా ముంబై ఇండియన్స్ అయితే చాల గొప్పగా పుంజుకుని ఈ రోజు ప్లే ఆఫ్ కు చేరుకుంది. గత రాత్రి చెన్నై మరియు గుజరాత్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ ను ఓడించి ధోని సేన సగర్వంగా ఫైనల్ కు చేరుకుంది. అయితే ఈ రోజు కృనాల్ పాండ్య మరియు రోహిత్ శర్మ ల మధ్యన పోటీ భారీగానే ఉండనుంది. ఈ మ్యాచ్ లో గెలిచే జట్టు క్వాలిఫైయర్ 2 లో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. మరి మాజీ ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు అయిన కృనాల్ మరియు రోహిత్ ల మధ్య సమరం ఏ విధంగా ఉండనుంది అనేది చూడాలి.

 

 

 

ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని ఇప్పటికే క్రికెట్ ప్రముఖులు మరియు ఫ్యాన్స్ ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారు. మరి ఎవరి అభిప్రాయాలూ కరెక్ట్ కానున్నాయి, గుజరాత్ తో తలపడే జట్టు ఏదో తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news