ఐపీఎల్: SRH vs KKR.. కోల్ కతా లక్ష్యం 143.

-

సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచులో మొదటి ఇన్నింగ్స్ పూర్తయ్యింది. మొదట బ్యాటింగ్ కి దిగిన సన్ రైజర్స్ 20ఓవర్లలో సన్ రైజర్స్ 4వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ గా దిగిన బైర్ స్ట్రో 5 పరుగులు చేసి 24పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ 36 పరుగులు చేసి, 59పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత మనీష్ పాండే, వృద్ధిమాన్ సాహా భాగస్వామ్యంతో జట్టు స్కోరు వందకి చేరుకుంది. మనీష్ పాండే 3 ఫోర్లు, 2సిక్సర్లతో 38బంతుల్లో 51 పరుగులు చేయగలిగాడు.

వృద్ధిమాన్ సాహా 31బంతుల్లో ఒక సిక్సర్, ఒక ఫోర్ తో 30 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నబీ 11పరుగులు, అభిషేక్ శర్మ 2పరుగులు చేయడంతో జట్టు స్కోరు 20ఓవర్లో 142 పరుగులకి చేరుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో కమ్మిన్స్, చక్రవర్తి, రస్సెల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news