రాజస్థాన్ అతని స్థానంలో హోల్డర్ ను బ్యాటింగ్ కు పంపుంటే …

-

నిన్న జరిగిన డబుల్ ధమాకాలో ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను అందించాయి. మొదట మ్యాచ్ లో రాజస్థాన్ మరియు బెంగుళూరు లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు, అలా బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టు నిర్ణీత ఓవర్ లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అనంతరం పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు మొదటి ఓవర్ లోనే బట్లర్ డక్ అవుట్ రూపంలో భారీ షాక్ తగిలింది. ఆ తర్వాత జైస్వాల్ మరియు పడిక్కల్ లు నెమ్మదిగా ఆడుతూ విజయానికి చేరువ చేశారు. అయితే పడిక్కల్ వేగంగా ఆడే క్రమంలో అవుట్ అవడంతో రాజస్థాన్ కు కష్టాలు స్టార్ట్ అయ్యాయి, ఆ ఆవెంటనే జైస్వాల్ అవుట్ అవ్వడం.. శాంసన్ కూడా ఎక్కువ సేపు నిలబడకపోవడంతో చేయాల్సిన రన్ రేట్ బాగా పెరిగిపోయింది.

ఆఖరి రెండు ఓవర్ లకు 33 పరుగులు చేయాల్సిన దశలో హెట్ మెయిర్ అవుట్ అయ్యాడు. ఆ స్థానంలో వెస్ట్ ఇండీస్ ఆల్ రౌండర్ హోల్డర్ కు బదులుగా అశ్విన్ ను పంపించడాన్ని అందరూ తప్పు బడుతున్నారు. ఒకవేళ హోల్డర్ వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version