ముంబై ఇండియన్ బ్యాట్స్ మెన్ పై ప్రశంసల వర్షం కురిపించిన సచిన్..

-

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూలర్ ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్ పై ప్రశంసలు కురిపించాడు. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో వీరోచిత ఇన్నింగ్స్ తో ముంబై ఇండియన్స్ స్కోరుని పరుగులు పెట్టించిన సూర్య కుమార్ యాదవ్ పై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. 47బంతుల్లో 79పరుగులతో( 11ఫోర్లు, 2సిక్సర్లు) ముంబైకి మంచి స్కోరు అందించాడు. ఈ నేపథ్యంలో సచిన్, సూర్యకుమార్ యాదవ్ ని డేంజర్ ఆటగాడిగా చెబుతూ, అతడు అని వైపుల ఆడగలడని అన్నాడు.

అలాగే బౌలింగ్ లో మెరుపులు మెరిపించిన బుమ్రాని కూడా మెచ్చుకున్నాడు. ఈ మ్యాచులో బుమ్రా, నాలుగు ఓవర్లు వేసిన నాలుగు వికెట్లు తీసుకుని 20పరుగులు మాత్రమే ఇచ్చాడు. మొత్తానికి అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ముంబై ఇండియన్స్ టీమ్, రాజస్తాన్ పై 57పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news