సన్ రైజర్స్ స్టార్ రషీద్ ఖాన్ కంటనీరు తెచ్చుకున్న వేళ..

-

మంగళవారం జరిగిన మ్యాచులో డిల్లీపై విజయం సాధించిన సన్ రైజర్స్ ఈ సీజన్లో మొదటి గెలుపుని అందుకుంది. సన్ రైజర్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయ తీరాలకి చేరుకుంది. బ్యాట్స్ మెన్ స్కోరుని పరుగులు పెట్టించగా, బౌలర్లు పరుగులు దక్కకుండా ఢిల్లీని అడ్డుకున్నారు. ఐతే ఈ మ్యాచులో రషీధ్ ఖాన్ అదిరిపోయే ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసిన రషీధ్ ఖాన్ 14పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.

ఐతే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్న రషీద్ ఖాన్, తన జీవితంలో జరిగిన విషాద సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచినప్పుడల్లా వాళ్ల అమ్మగారు చాలా సంతోష పడేవారట. కానీ ఇప్పుడు సంతోషించడానికి అమ్మగారు లేరని కొన్ని నెలల క్రితం చనిపోయిందని తెలిపాడు. అదే కాదు రషీద్ ఖాన్ తండ్రి కూడా గత సంవత్సరం చనిపోయాడట. సంవత్సరం గ్యాప్ లో అమ్మానాన్నని పోగొట్టుకున్న రషీద్ ఖాన్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకుంటూ కంటనీరు తెచ్చుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news