ఫామ్ లోకి వచ్చిన పంత్.. ప్రాక్టీస్ మ్యాచ్ లో అర్థ సెంచరీ

-

ఐపీఎల్ తో పాటు సౌత్ ఆఫ్రికా తో టీ-20 సిరీస్ లో తీవ్రంగా నిరాశపరిచిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి ఫామ్ అందుకున్నాడు. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు సన్నాహకంగా భారత టెస్ట్ జట్టు, లిస్టర్షిన్ మధ్య జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ లో పంత్ అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో లిస్టర్షైన్ తరఫున బరిలోకి దిగిన రిషబ్.. తనదైన శైలిలో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు.

భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ అర్థ సెంచరీ సాధించాడు. 87 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 76 పరుగులు చేసిన పంత్.. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ముందు ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకున్నాడు. పంత్ రాణించడంతో లిస్టర్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 57 ఓవర్లలో 244 పరుగుల వద్ద ఆలౌటైంది. పంత్ టాప్ స్కోరర్ గా నిలవగా.. చటేశ్వర్ పుజారా(0) డక్ అవుట్ అయ్యి నిరాశపరిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news