ఫైనల్​కు తెలుగు వారియర్స్.. కర్ణాటక బుల్డోజర్స్​పై విజయం

-

సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ చివరి దశకు చేరుకుంది. సెమీఫైనల్స్‌ క్రికెట్‌ పోటీలు శుక్రవారం.. విశాఖపట్నంలోని పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో హోరీహోరీగా సాగాయి. రెండో సెమీఫైనల్‌లో తెలుగు వారియర్స్‌, కర్ణాటక బుల్డోజర్స్‌ జట్లు తలపడగా.. తెలుగు వారియర్స్​ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఫైనల్​కు దూసుకెళ్లింది. తెలుగు వారియర్స్‌కు అఖిల్‌ అక్కినేని సారథ్యం వహించారు. కర్ణాటక బుల్డోజర్స్‌కు సుదీప్ కెప్టెన్‌గా వ్యవహరించారు.

రెండో సెమీఫైనల్​లో కర్ణాటక జట్టు తొలి ఇన్నింగ్స్​లో పది ఓవరల్లో.. ఆరు వికెట్ల నష్టంతో 99 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన తెలుగు వారియర్స్​.. అదే ఆరు వికెట్ల నష్టంతో 95 పరుగులే చేసింది. తెలుగు వారియర్స్‌ బౌలర్‌ సామ్రాట్‌ మొదటి ఇన్సింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు.  రెండో ఇన్నింగ్స్​లో కర్ణాటక టీమ్​.. 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు కొట్టింది. తెలుగు వారియర్స్‌ బ్యాటర్లు ధాటిగా బ్యాటింగ్‌ చేసి 103 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేశారు. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్​కు దూసుకెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news