దారుణ ఓటమిపై మహిళా ఆర్చర్ల రియాక్షన్..!

-

ఒలంపిక్స్ 2024 లో భారత ఆర్చర్లపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అందుకు తగ్గిన విధంగా మన ఆర్చర్లు రాణించడం లేదు. అయితే ఈ రోజు మహిళల గ్రూప్ ఆర్చరీలో భారత జట్టు దారుణమైన ప్రదర్శన చేసింది. ముఖ్యంగా గెలవాల్సిన మూడో సెట్ లో అయితే 4 పాయింట్స్ ను హిట్ చేసారు. ఇదే భారత జట్టు ఓటమిలో కీలకం అయ్యింది.

అయితే ఓటమి తర్వాత విపరీతమైన భావోద్వేగానికి లోనైనా సీనియర్ ఆర్చర్ దీపికా.. మేము ఇంత దారుణంగా ఎప్పుడు ఆడలేదు అని స్వయంగా ప్రకటించింది. ఈ మ్యాచ్ లో మేము చాల ఒత్తిడికీ లోనయమని.. గందరగోళానికి గురయ్యామని పేర్కొంది. గాలికి తగ్గిన విధంగా తాము పొజిషన్ తీసుకోలేకపోయామని పేర్కొంది. గాలిని కంట్రోల్ చేయడం మన చేతులో లేని పని అని తెలిపింది. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు 0-6 తో ఓడిపోయింది. ఒకవేళ ఇందులో గెలిచుంటే ఇండియా సెమీస్ లోకీ ఎంట్రీ ఇచ్చేది.

Read more RELATED
Recommended to you

Latest news