ఇండియాకు షాక్ ఇచ్చిన ఇంగ్లాండ్…!

-

అంతర్జాతీయంగా ఇప్పుడు క్రికెట్ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. వేలాది కోట్ల వ్యాపారం కనపడని వైరస్ దెబ్బకు ఆగిపోయింది. దాదాపు అన్ని దేశాలు కూడా క్రికెట్ విషయంలో వెనక్కు తగ్గుతున్నాయి. క్రికెట్ ని ఎంతగానో ప్రేమించే భారత్ లో క్రికెట్ మ్యాచ్ ల కోసం ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నారు జనాలు. కాని ఇప్పట్లో క్రికెట్ మ్యాచ్ లు జరిగే అవకాశాలు దాదాపుగా లేవు ఆనే చెప్పాలి.

ఇదిలా ఉంటే ఇప్పుడు సెప్టెంబర్ లో ఇంగ్లాండ్ టీం భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉంది అని భావించారు. కాని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాత్రం అసలు దేశం దాటి మా వాళ్ళు వచ్చే ప్రశ్నే లేదు అని స్పష్టంగా చెప్పేసింది. దీనితో ఇప్పుడు రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ లు లేనట్లే అని స్పష్టత వచ్చేసింది. వాస్తవానికి సెప్టెంబర్ లో టి20 సీరీస్ జరగాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news