రాంచీ టెస్టు: దక్షిణాఫ్రికా 162 ఆలౌట్.. ఫాలో ఆన్ ఇచ్చిన కొహ్లీ సేన

-

రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టుకి 335 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆటలో మూడో రోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 9/2తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో సెషన్‌లోనే 162 పరుగులకి ఆలౌటైంది. ఎల్గర్‌ (0) , డికాక్‌ (4), డుప్లెసిస్ ( 1) ఔటైన విషయం తెలిసిందే. అనంతరం హంజా (79 బంతుల్లో 62 పరుగులు), బవుమా (72 బంతుల్లో 32), క్లాసేన్ (10 బంతుల్లో 6), పైడ్త్ (14 బంతుల్లో 4), రబాడా (6 బంతుల్లో 0), లిండె (81 బంతుల్లో 37), నోర్ట్ జె (55 బంతుల్లో 4), ఎన్గిడి (0, నాటౌట్) వెనుదిరిగారు.

టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ కి మూడు వికెట్లు, షమీ, జడేజా, నదీమ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. టీమిండియా నిన్న 116.3 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 497 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 335 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో దక్షిణాఫ్రికాకు కొహ్లీ సేన ఫాలో ఆన్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news