ఇండియా ఓపెన్ : తొలి రౌండ్‌లో స‌త్త చాటిన సింధు, శ్రీ‌కాంత్

-

న్యూ ఢిల్లీ వేదిక గా మంగ‌ళ వారం నుంచి ఇండియా ఓపెన్ ప్రారంభం అయిన విష‌యం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో టైటిల్ ఫెవ‌రేట్ గా మ‌హిళ‌ల సింగిల్స్ లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీ కాంత్ బ‌రిలో ఉన్నారు. కాగ తొలి రోజే పీవీ సింధు, కిదాంబి శ్రీ కాంత్ స‌త్త చాట‌రు. మహిళ‌ల సింగిల్స్ లో తొలి రౌండ్ లో పీవీ సింధు అద్భ‌త విజ‌యం సాధించింది. ప్ర‌త్య‌ర్థి భార‌త్ కు చెందిన‌ శ్రీ కృష్ణప్రియ పై 21-5, 21-16 తేడాతో విజ‌యం సాధించింది.

దీంతో పీవీ సింధు ప్రి క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ లో అడుగు పెట్టింది. అలాగే పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీ‌కాంత్ కూడా తొలి విజ‌యాన్ని అందుకున్నాడు. ప్ర‌త్య‌ర్థి భార‌త్ కు చెందిన సిరిల్ వ‌ర్మ పై కిదాంబి శ్రీ‌కాంత్ 21-17, 21-10 తేడాతో విజ‌యం సాధించాడు దీంతో కిదాంబి శ్రీ‌కాంత్ కూడా ప్రి క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ కు చేరాడు. వీరితో పాటు మ‌హిళల సింగిల్స్ తొలి రౌండ్ లో ఐరా శ‌ర్మ విజ‌యం సాధించింది. అలాగే పురుషుల సింగిల్స్ లో స‌మీర్ వ‌ర్మ గెలిచాడు. అలాగే మిక్స్‌డ్ డ‌బుల్స్ తొలి రౌండ్‌లో ధ్రువ్ క‌పిల – సిక్కి రెడ్డి విజ‌యం సాధించారు. అలాగే సాయి ప్ర‌తీక్ – గాయ‌త్రి గోపిచంద్ పుల్లెల గెలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news