ఉద్యోగాల కోసం బీహార్‌ వెళ్లిన తెలంగాణ యువకులు ముగ్గురు మృతి

-

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉద్యోగాల కోసం బీహార్ కు వెళ్లిన ముగ్గురు యువకులు అక్కడే మృతి చెందిన సంఘటన మహబూబ్‌ నగర్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన వెంకటేష్(25), శ్రీను (23), సంతోష్ (24) ముగ్గురు ఇటీవలే ఉద్యోగాల కోసం బీహార్‌ రాష్ట్రానికి వెళ్లారు.

అయితే.. అక్కడ ఏం జరిగిందో తెలీదు కానీ… ఆ ముగ్గురు యువకులు మృతి చెందారు. భూత్పూర్ మండలం లోని గుబ్బడితండా, మిట్యాతండా, నక్కల బండ తండా లకు చెందిన వారుగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు వారిని గుర్తించారు. బీహార్‌ పోలీసులను నుంచి మృత దేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు… మహబూబ్‌ నగర్‌ కు తరలించారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…ఆ ముగ్గురు యువకులు బీహార్ ఎందుకు వెళ్లారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇక ఈ కేసులో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news