విండీస్‌పై ఆఖరి వన్డేలో టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

-

కటక్ వేదికగా వెస్టిండీస్ తో జరగుతోన్న మూడో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక మార్పు చేశాడు. గాయపడిన ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ స్థానంలో యువ పేసర్ నవదీప్ షైనీని తీసుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా.. రెండు జట్లూ చెరొక మ్యాచ్‌లో విజయం సాధించాయి.

దీంతో.. సిరీస్ విజేత నిర్ణయాత్మక ఆఖరి వన్డేపై ఉత్కంఠ నెలకొంది. కాగా, కటక్ స్టేడియంలో వెస్టిండీస్‌కి ఏమాత్రం మెరుగైన రికార్డ్ లేదు. ఇక్కడ భారత్‌తో మూడు మ్యాచ్‌ల్లో తలపడిన కరీబియన్లు.. మూడింట్లోనూ చిత్తుగా ఓడిపోయారు. మరోవైపు కటక్‌లో ఇప్పటి వరకూ 16 మ్యాచ్‌లాడిన టీమిండియా ఏకంగా 12 మ్యాచ్‌ల్లో విజయాల్ని అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news