IND vs NZ : దుమ్ములేపిన సూర్య కుమార్ .. రెండో టి20లో టీమిండియా విజయం

-

టీమిండియా మళ్లీ విజయాల బాట పట్టింది. లక్నో వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టి20 లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లో స్కోర్ నమోదు అయినప్పటికీ, ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన కివిస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పదవులు మాత్రమే చేయగలిగింది.

100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్ ను 1-1 తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో టి20 ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు 30 ఓవర్లు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాయి. అంతర్జాతీయ టి20లో ఫుల్ మెంబర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఎక్కువ ఓవర్లు స్పిన్నర్లతో వేయించిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news