టీమిండియాకు బిగ్ షాక్.. ఆస్పత్రిలో చేరిన ఇషాన్​ కిషన్ !

-

టీమిండియాను గాయాలు వదలడం లేదు. శ్రీలంక టూర్ కు ముందు చాలా మంది టీ మీడియా ప్లేయర్లు గాయాలపాలయ్యారు. ఇక తాజాగా టీమిండియా యంగ్ ప్లేయర్ కిషన్ కూడా మూడో టి20 మ్యాచ్ కు దూరమయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. శనివారం లంక తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో అతని తలకు తగిలి గాయమైంది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో లాహీర్ కుమారా… 150 స్పీడ్ తో బౌన్సర్ వేశాడు.

అయితే దాన్ని డిఫెండ్ చేసే క్రమంలో ఇషాన్ కిషన్ హెల్మెట్ కు బలంగా తగిలింది. వెంటనే ఫిజియో వచ్చి అతడిని పరిశీలించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆసుపత్రికి ఇషాన్ కిషన్ తరలించారు. తలకు తగిలింది బలమైన గాయమా ? సాధారణమైన దా? అనేది తెలుసుకునేందుకు బ్రెయిన్ స్కానింగ్ చేశారు వైద్యులు. దీనికి సంబంధించిన ఫలితాలు రావడానికి కాస్త సమయం పడుతుంది. ముందస్తు జాగ్రత్తగా అతడు ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలిసింది. దీనిపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news