వేగంగా కోలుకుంటున్న రిషబ్ పంత్… త్వరలోనే టీం లోకి !

-

కొంతకాలం క్రిందట కారులో ప్రయాణిస్తున్న టీం ఇండియా ఆటగాడు రిషబ్ పంత్ ప్రమాదానికి గురయ్యి విశ్రాంతిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రమాదం వలన జరుగుతున్న ఐపీఎల్ కు మరియు జూన్ లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు కూడా దూరం అయ్యాడు. దీనితో ఢిల్లీ క్యాపిటల్స్ ఎంతగా నష్టపోయిందో చూశాము… వార్నర్ కెప్టెన్సీ లో దారుణంగా ఫెయిల్ అయ్యి ప్లే ఆప్స్ కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. కాగా తాజాగా పంత్ కు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అభిమానులను హ్యాపీ చేస్తోంది అని చెప్పాలి. తాజాగా రిషబ్ పంత్ ముంబై ఎయిర్పోర్ట్ ఎటువంటి స్టిక్ సహాయం లేకుండా నడుస్తూ కనిపించాడు.

దీనితో రిషబ్ పంత్ త్వరగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా జరిగితే త్వరలోనే క్రికెట్ ప్రాక్టీస్ చేసి ఇండియా జట్టులోకి పునరాగమనం చేస్తదనడంలో ఎటువంటి సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news