T20లకు రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ?

-

కచ్చితంగా గెలవాల్సిన సెమీఫైనల్స్ లో టీమిండియా ఘోర పరాభావాన్ని చవిచూసింది. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ పోరులో టీమిండియా చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అయితే…  T20WC సెమీ ఫైనల్ లో ఓటమి తర్వాత టీమ్ ఇండియాలో కీలక మార్పులకు బీసీసీఐ సిద్ధమవుతోందని తెలుస్తోంది.

టి20 జట్టు నుంచి రోహిత్, కోహ్లీ, అశ్విని లాంటి సీనియర్లను పక్కన పెట్టబోతున్నట్లు ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. “పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించమని ఏ ఆటగాడిని యాజమాన్యం అడగలేదు. కానీ 2023లో జరిగే టి20 మ్యాచ్ లలో సీనియర్లకు చోటు దక్కదు. యువకులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం” అని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news