WI vs Ind : ఇండియాపై విండీస్ గ్రాండ్ విక్టరీ..

-

West Indies vs India, 2nd T20I : విండీస్‌ సిరీస్‌ లో టీమిండియాకు బిగ్‌ షాక్‌ తగిలింది. సెయింట్ కింట్స్‌ వేదికగా జరిగిన రెండో టీ 20 లో టీమిండియా పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని చేధించింది విండీస్‌. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 138 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఈ లక్ష్యాన్ని విండీస్‌ 5 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది.

ఫలితంగా లక్ష్యం మోస్తరే అయినప్పటికీ.. టీమిండియా ఆఖరి వరకు పోరాడి ఓటమి పాలైంది. విండీస్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్ 68 పరుగులు చేసి రాణించారు. డెవాన్‌ థామస్‌ 31 పరుగులు చేసి.. విండీస్‌ ను ఆదుకున్నారు. ఇక టీమిండియా బౌలర్లలో హార్ధిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అవేశ్‌ ఖాన్‌, అర్ష్‌ దీప్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. విండీస్‌ తాజా విజయంతో ఐదు మ్యాచ్‌ ల సిరీస్‌ ను 1-1 తో సమంగా మారింది. ఇక ఇవాళ మూడో టీ 20 మ్యాచ్‌ జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news