సిద్ధార్థ్ దేశం కోసం ఏం చేశాడు: సైనా తండ్రి

-

స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌పై సినీ నటుడు సిద్ధార్థ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రులు, జాతీయ మహిళా కమిషన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. తాజా సైనా నెహ్వాల్ తండ్రి హర్‌వీర్ సింగ్ నెహ్వాల్ సిద్ధార్థ్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. తన కూతురు దేశం కోసం పతకాలు సాధించిందని, ఆ నటుడు ఏం చేశాడో చెప్పాలని పేర్కొన్నారు.

నా కూతురు పట్ల ఆ నటుడు చేసిన వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా కలిచివేశాయి. ఆ నటుడు దేశం కోసం ఏం చేశాడు. సైనా నెహ్వాల్ ఎన్నో పతకాలను తీసుకువచ్చింది. భారత్ కీర్తి ప్రతిష్ఠలను పెంచింది. భారతదేశం గొప్ప సమాజం అని నేను ఎప్పుడూ నమ్ముతాను. సైనాకు జర్నలిస్టులు, క్రీడా సోదరుల మద్దతు ఉంది. ఎందుకంటే ఓ క్రీడాకారుడు ఎంత కష్టపడుతాడో వారికి తెలుసు అని హర్‌వీర్ సింగ్ నెహ్వాల్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news