వైఎస్ వివేకా హత్య పై శ్రీ రెడ్డి హాట్ కామెంట్స్ !

-

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం ఈ కేసులో అనుమానితుడు గా ఉన్న… వైయస్ వివేకానంద రెడ్డి డ్రైవర్ దస్తగిరి సిబిఐ అధికారుల ముందు లొంగిపోయాడు. ఈ సందర్భంగా కీలక విషయాలను అధికారులకు చెప్పాడు దస్తగిరి. వైయస్ వివేకానంద హత్య తామే చేసామని.. దీని వెనక వై.ఎస్.అవినాష్ రెడ్డి తో పాటు ఆయన తండ్రి భాస్కర్రెడ్డి కూడా ఉన్నారని సి.బి.ఐ అధికారుల ముందు వెల్లడించాడు. దీంతో.. వైఎస్ అవినాష్ రెడ్డి ని అరెస్టు చేయాలని డిమాండ్ ప్రతిపక్ష నాయకుల నుంచి వస్తోంది.

అటు తెలుగుదేశం, జనసేన పార్టీకి సంబంధించిన టీవీ ఛానళ్లు.. ఈ కేసు పైన దృష్టి సారించాయి. వరుసగా డిబేట్లు పెట్టుకుంటూ… ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అన్యాయంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని జనసేన పార్టీ అలాగే టిడిపి పార్టీ నాయకుల పై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.

ముఖ్యంగా పావలా కళ్యాణ్ అంటూ.. పవన్ పై మండిపడ్డారు శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ కు చెందిన ఓ మీడియా సంస్థ అనవసరంగా వైఎస్.వివేకానంద కేసుపై డిబేట్ లు పెట్టి జగన్మోహన్రెడ్డిని నిందితుడిగా చూపిస్తుంది అంటూ ఆమె నిప్పులు చెరిగారు. అలాగే టీడీపీకి చెందిన ఓ ఛానల్ కూడా ఇలాగే చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీ రెడ్డి. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను మాత్రం ఈ మీడియా ఛానళ్లు ప్రసారం చేయకపోవడంపై మండిపడ్డారు. ఇలాంటి చిల్లర వేషాలు ఇకనైనా మానుకోవాలని చురకలంటించారు శ్రీ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news