విమర్శలను ప్రశంసలుగానే భావిస్తా : శృతి హాసన్‌

-

తన పై వచ్చిన విమర్శల పై తాజాగా ఒక ఇంటర్వ్యూలో శృతి హాసన్ స్పందించారు హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ డిఫరెన్స్ గురించి వస్తున్న విమర్శలను తాను అసలు పట్టించుకోనని స్పష్టం చేశారు ఆమె. తనను ప్రేక్షకులు ఇంకా చిన్న పిల్లలా చూస్తున్నందుకు ఆ వ్యాఖ్యలను ప్రశంసగా స్వీకరిస్తానని అన్నారు. సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాదని, హిందీ ఇసినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రెండు పెద్ద సినిమాల్లో హీరో హీరోయిన్స్ మధ్య ఏజ్ గ్యాప్ అంతే ఉందని తెలిపారు. లెజెండరీ హీరోలతో నటించే అవకాశం వచ్చినప్పుడు తాను ఎందుకు ‘నో’ చెప్పాలని శృతి హాసన్ అడిగారు. విమర్శలు తన పై రావడం లేదని, చిరంజీవి గారు లేదా బాలకృష్ణ గారు లేదా తనను ఎవరూ విమర్శించడం లేదని, ఆ పాత్ర అలా రాసినందుకు దర్శకులను విమర్శిస్తున్నారు కనుక వాటికి తాను ప్రాముఖ్యం ఇవ్వనని ఆమె స్పష్టం చేశారు.

Shruti Haasan Reacts To Instagram User Asking About Her Breakups

మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ , నట సింహం నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ లో శ్రుతీ హాసన్ కథానాయికగా నటించారు. ఆ రెండు సినిమాల్లో నటించినందుకు సుమారు మూడు కోట్ల రూపాయలు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. మంచులో డ్యాన్స్ చేయడం నాకు ఇష్టం లేదు. స్నోలో డ్యాన్స్ చేయడం చాలా కష్టం కూడా! హీరోలు జాకెట్ వేసుకోవచ్చు. అయితే… హీరోయిన్లు శారీ అండ్ బ్లౌజ్ తప్ప జాకెట్, శాలువా, కోట్ వంటివి ఏవీ వేసుకోకూడదు. ఇటువంటి పాటలు తీయడం ఆపేయండి. దయచేసి నా మాటలను ఓ పిటీషన్ కింద తీసుకోండి. నేను ఇటీవల అటువంటి పాట ఒకటి చేశా. దర్శకుడి దగ్గరకు వెళ్లి నా మనసులో మాట చెప్పే ప్రయత్నం చేశా. వాళ్ళకు మంచులో పాట అంటే చాలా ఇష్టం. నేను ఏమీ చేయలేకపోయా” అని శృతి హాసన్ తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news