బ్రేకింగ్‌ : ఏపీ అసెంబ్లీ ప్రారంభం..గవర్నర్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభం అ య్యాయి. అసెంబ్లీ సమావేశాలకు సీఎం జగన్‌, వైసీపీ ఎమ్మెల్యే అలాగే.. చంద్రబాబు మినహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇక అసెంబ్లీ ప్రారంభం కాగానే.. గవర్నర్‌ విశ్వభూషన్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. ప్రసంగించారు. ఈ నేపథ్యంలోనే.. టీడీపీ నేతలు సభలో గందర గోళం సృష్టించారు. గవర్నర్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో సంభ పూర్తిగా గందరగోళంగా మారి పోయింది.

గవర్నర్‌ స్పీకర్‌ కాపీలను టీడీపీ పార్టీ సభ్యులు చించేశారు. గవర్నర్‌ ప్రసం గ సమయం లో టీడీపీ పార్టీ సభ్యులు నినాదాలు చేసుకుంటూ.. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే.. టీడీపీ పార్టీ సభ్యుల ప్రవర్తనపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అసహనం వ్యక్తం చేసారు. ఇలాంటి వ్యవహరం మంచిది కాదని వారితో వారించారు. దీంతో తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news