స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్న సుధీర్..!!

-

బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షో ల ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న యాంకర్లలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. ఈటీవీ ఛానల్ కు దూరంగా ఉంటూ ప్రస్తుతం ఇతర చానల్స్ లో ప్రసారమవుతున్న ప్రోగ్రామ్ లతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక పోతే ఆదివారం ప్రసారమైన థాంక్యూ దిల్సే ప్రోగ్రాంలో రాశీ ఖన్నా తో సుధీర్ రొమాన్స్ చేయడం గమనార్హం. ఇక ఆదివారం ప్రసారమైన ఈ ఎపిసోడ్ లో గోపీచంద్- శ్రీముఖి ఒక వైపు ఉండగా.. సుధీర్ – రాశీ ఖన్నా మరొకవైపు ప్రేక్షకులను అలరించారు.. శ్రీముఖి, గోపీచంద్ తో కలిసి..” ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన” అనే పాట పాడారు. ఇక సుధీర్ నేను అడిగితే శ్రీముఖి ఒక లైన్ కూడా పాడలేదని చెప్పగా.. లేడీస్ అడిగిన సమయంలో పాడకపోతే ఫీల్ అవుతారని అంటూ గోపీచంద్.. సుధీర్ పరువు తీసేశారు.రష్మిని వదిలేసి రాశి ఖన్నాతో సుధీర్ రొమాన్స్

ఇక ఆ తర్వాత సుధీర్ మా వైపు రాశీ ఖన్నా గారు ఉన్నారు అని చెబుతారు. ఇక ఆ తర్వాత రాశీ ఖన్నా.. నా కోసం నువ్వు ఒక పాట పాడుతావా అని సుధీర్ ని అడిగితే.. సుదీర్ సిగ్గుపడుతూ నేను అమ్మాయిలను ఎప్పుడు టచ్ చేయను అంటూ కామెంట్ చేయను అనడం తో ప్రస్తుతం వైరల్ గా మారింది.. ఇక రాశి ఖన్నా మొదట ఏం సందేహం లేదు అనే పాటను అద్భుతంగా పాడి అలరించారు. ఇక రాశి ఖన్నా తో మాట్లాడుతూ నాకు అమ్మాయిలను ముట్టుకోవడం చాలా ప్రాబ్లం అని చెబితే ..నాకేం ప్రాబ్లం లేదని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత శ్రీ ముఖి మాట్లాడుతూ..సుధీర్, రాశిఖన్నా కలిసి డాన్స్ చేయాలని కోరితే అమ్మాయిలతో డాన్స్ చేయడం నాకు సిగ్గు అని చెబుతాడు. అప్పుడు మారుతి అమ్మాయిలతో కాకుండా డాన్స్ అబ్బాయిలతో చేస్తావా అంటూ సుధీర్ పరువు తీసేశారు. ఆ తర్వాత వీరిద్దరూ ఏం సందేహం లేదు అనే పాటకు డాన్స్ చేసి మెప్పించారు. ఇది చూసిన చాలామంది రష్మీ ని పక్కన పెట్టి రాశీ ఖన్నా తో రొమాన్స్ చేస్తున్నాడు సుధీర్ అంటూ నెటిజన్స్ కామెంట్ చేయడం గమనార్హం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news