బీజేపీని మతతత్వ పార్టీ అంటే వారిని దవడపై కొట్టాలి : సునీల్ బన్సల్‌

-

జగిత్యాల జిల్లా కోరుట్లలోని శివసాయి గార్డెన్ లో సోమవారం మహాబిన్ సంపర్క్ అభియాన్ సోషల్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తొమ్మిదేళ్ల మోదీ సారథ్యంలోని బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ అన్నారు. అక్కడ ఆయన ప్రసంగిస్తూ ముస్లిం, క్రైస్తవ మైనార్టీలను బీజేపీ ఏ రోజు కూడా ఓటు బ్యాంక్ లాగా చూడలేదన్నారు. వారి సంక్షేమం కోసం బీజేపీ పాటు కృషి చేస్తుందని వెల్లడించారు. బీజేపీని మతతత్వ పార్టీ అంటే వారిని దవడపై కొట్టాలని బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు.

BJP President JP Nadda Appoints Sunil Bansal as General Secretary of the  Party

దేశంలో 56 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే అగ్రగామిలో దేశాన్ని నిలపారని వ్యక్తపరిచారు ఆయన. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజల బాగోగులు మర్చిపోయిందంటూ మండిపడ్డారు. రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. రానున్న ఎన్నికల్లో దేశం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు పాటుపడాలన్నారు బన్సల్.

Read more RELATED
Recommended to you

Latest news