మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

-

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కేసులో సుప్రీంకోర్టులో నిందితుల పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణ ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. నిందితుల తరపున వాదిస్తున్న న్యాయవాది ఈరోజు స్థానిక కోర్టులో బెయిల్ పిటిషన్​పై నిర్ణయం వెలువడనున్నట్లు న్యాయస్థానానికి వివరించారు. అందువల్ల విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్​ బీఆర్​ గవాయ్, జస్టిస్​ విక్రమ్​ నాథ్​లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదావేసింది.

మరోవైపు ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ వరుస సోదాలు నిర్వహిస్తోంది. నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌కి చెందిన ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపారసంస్థలు, ఆశ్రమాల్లో రెండురోజులుగా తనిఖీలు కొనసాగాయి. శనివారం మొదలైన సోదాలు ఆదివారం రాత్రి వరకు జరిగాయి. తనిఖీల కోసం ఇందుకోసం 7 బృందాలను ఏర్పాటు చేశారు. తెలుగురాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, హరియాణలోనూ తనిఖీలు నిర్వహించాయి. కేరళలో ఓ వైద్యుడి ప్రమేయాన్ని గుర్తించిన పోలీసులు.. కేసుతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news