పెద్దనోట్ల రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు తీర్పు

-

పెద్ద నోట్లని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాకలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో 58 పిటిషన్లు దాఖలు అయ్యాయి. రూ. 1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేశారు. జస్టిస్ ఎన్ ఎ నజీర్ సారధ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది.

న్యాయమూర్తులు గవాయ్, నాగరత్న, ఏఎస్ బొమ్మై, వి రామసుబ్రహ్మణ్యన్ లు ఈ ధర్మాసనంలో ఉన్నారు. 2016 నవంబర్ 8న కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన రికార్డులను తమకు సమర్పించాలంటూ గత డిసెంబర్ 8న కేంద్రం, ఆర్బిఐ ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. శీతాకాల సెలవుల అనంతరం సుప్రీంకోర్టు సోమవారం ( నేడు ) తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు తీర్పుని వెలువరించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news