మదర్సాలపై NCPR సిఫార్సులపై సుప్రీం స్టే.. కేంద్రం,రాష్ట్రాలకు నోటీసులు!

-

మదర్సాల అంశంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) సిఫార్సులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. విద్యాహక్కు చట్టాన్ని మదర్సాలు పాటించడం లేదని, ప్రభుత్వ నిధులతో నడిచే వాటిని మూసేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై సుప్రీం సోమవారం స్టే ఇచ్చింది. యూపీ, త్రిపుర ప్రభుత్వాలు ఇటీవల జారీ చేసిన ఆదేశాలను కూడా కోర్టు నిలిపివేసింది.

గుర్తింపు లేని మదర్సాలు, ప్రభుత్వ-ఎయిడెడ్ మదర్సాలలో చదువుతున్న ముస్లిమేతర విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేయాలన్న సూచనలపై కూడా స్టే ఇచ్చింది.కాగా, ఈ ఏడాది జూన్‌ 7, జూన్‌ 25 తేదీల్లో జారీ చేసిన ఎన్‌సీపీసీఆర్‌ సిఫారసులపై చర్య తీసుకోరాదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే, యూపీ ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ జమియత్ ఉలమా-ఇ-హింద్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణ చేపట్టింది.4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version